ఒకసారి అమరావతిలో బుద్దుడి విగ్రహాన్ని చెక్కిన శిల్పిని అడిగారంట ప్రజలు .అంత అందమైన శిల్పాన్ని ఎలా చెక్కారు ? అని .ఆ శిల్పి "ఏమి లేదు అనవసరమైనవి అన్నీ తీసేసాను ! అవసరమైనవి అన్నీ ఉంచాను ,ఆద్భుతమైన బుద్దుని విగ్రహం వచ్చింది "అని చెప్పాడు.
ఆ శిల్పికి ఏది ఉంచాలో ,ఏది తీసివేయాలో స్పష్టత ఉంది .అందుకే అంత సుందరమైన బుద్ధుని విగ్రహం వచ్చింది. మనకు మన జీవితంలో ఏది చేయాలో, ఏది చేయ కూడదో స్పష్టత ఉంటే జీవితం బ్రహ్మానందమయం.
No comments:
Post a Comment